ఊర్లో ఒక పేద వ్యక్తి
ఉన్నపళంగా కోటీశ్వరుడైతే ఆ ఆనందం అతనొక్కడిదే.. అదే ఆ ఊరు ప్రజలంతా
కోటిశ్వరులైతే.. ఎలా ఉంటుందో ఊహించుకోండి. అలాంటిదే జరిగింది స్పెయిన్లో.
స్పెయిన్లో సెరిజేల్ డెల్ కాండెడో అనే ఓ చిన్న పల్లెటూరి జాతకం
రాత్రికిరాత్రే మారిపోయింది. ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికీ రాత్రిరాత్రే రూ.
17 కోట్లు వచ్చాయి. ఇదంతా ఓ వ్యక్తి దాతృత్వం వల్ల జరిగింది. ఆంటోనినో
ఫెర్నాండేజ్ అనే వ్యక్తి స్పేయిన్లో ‘కరోనా’ అనే బీర్ల తయారీ సంస్థకు
యజమాని. అతని చిన్నతనంలో చదువుకునే స్థోమత లేక 14ఏళ్ల వయసులోనే బడికి
వెళ్లడం మానేసి ఓ బీర్ల తయారీ కంపెనీలో పనిచేశాడు. అక్కడి నుంచి
అంచెలంచెలుగా ఎదిగి ‘కరోనా’ అనే బీర్ల తయారీ సంస్థను నెలకొల్పాడు. అయితే
తాను పుట్టి పెరిగిన ఊరు నేటికీ మారకపోవడం, చాలా మంది పిల్లలు డబ్బుల్లేక
చదువుకు దూరమవుతుండటంతో కలత చెందారు. ఈ క్రమంలో తాను మరణించిన తరువాత తన
ఆస్తిలోని ఎక్కువభాగం గ్రామ వాసులకు చెందేలా వీలునామా రాశారు. కాగా, ఈ
ఏడాది ఆగస్టులో ఫెర్నాండేజ్ చనిపోయాడు. దీంతో అతని ఆస్తిని గ్రామంలోని 150
కుటుంబాలకు పంపిణీ చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఫెర్నాండేజ్
మృతికి సంతాపం తెలిపి, ఆయన ఆశయానికి అనుగుణంగా వచ్చిన డబ్బును
ఖర్చుచేస్తామన్నారు.
No comments:
Post a Comment