నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన రూ.2 వేల నోటును మళ్లీ రద్దు చేసే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. నల్ల ధనాన్ని రూపుమాపేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా వ్యూహాత్మకంగా ఈ పెద్ద నోటును ప్రభుత్వం విడుదల చేసిందని వారంటున్నారు. దేశంలో సగం అనర్ధాలకు మూలం పెద్ద నోట్లేనని అత్యధిక భాగం అభిప్రాయపడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు పలుమార్లు తన అభిప్రాయాన్ని వెల్లడించారు కూడా. పెద్ద నోట్లను రద్దు చేయాలని పలుమార్లు ఆయన కేంద్రానికి సూచించారు.
రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన మోడి ప్రభుత్వం, మళ్లీ రూ.2వేల నోటును తీసుకురావడం పట్ల విమర్శలు రేగిన సంగతి కూడా తెలిసిందే. నల్లధనాన్ని దేశంలో లేకుండా చేస్తానని చెప్పిన ప్రభుత్వం ఇలాంటి పెద్ద నోట్లను మళ్లీ తీసుకురావడమేమిటని పలువురు ప్రశ్నించినా దానిపై కేంద్రం నుండి స్పష్టమైన సమాధానం రాలేదు.
రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన మోడి ప్రభుత్వం, మళ్లీ రూ.2వేల నోటును తీసుకురావడం పట్ల విమర్శలు రేగిన సంగతి కూడా తెలిసిందే. నల్లధనాన్ని దేశంలో లేకుండా చేస్తానని చెప్పిన ప్రభుత్వం ఇలాంటి పెద్ద నోట్లను మళ్లీ తీసుకురావడమేమిటని పలువురు ప్రశ్నించినా దానిపై కేంద్రం నుండి స్పష్టమైన సమాధానం రాలేదు.
No comments:
Post a Comment