బాదం
పప్పు కలిగి ఉండే పై పొర, సరైన స్థాయిలో సూర్యకాంతి మరియు తేమ ఉండేంత వరకు
అనుమతించబడే ఎంజైమ్ ఇన్హిబిటర్ (ఎంజైమ్ నిరోధకం)ను కలిగి ఉంటాయి. ఒకవేళ
మీరు బాదంపై ఉన్న పొర తీసివేయకుండా తింటే, మీ శరీరం పోషకాలను గ్రహించలేదు.
అంతేకాకుండా, జీర్ణం అవటానికి కూడా కష్టంగా మారతుంది. ఒకవేళ పూర్తి రాత్రి
నీటిలో నానబెడితే, పై పొరను సులభంగా తొలగించవచ్చు మరియు సులభంగా పోషకాలను
పొందవచ్చు. నానబెట్టిన బాదంలు త్వరగా జీర్ణమవటమే కాకుండా, జీర్ణక్రియను
ప్రోత్సహించే ఎంజైమ్ లను విడుదల చేస్తాయి.
బాదంలను నానబెట్టడం
వలన వాటి నిర్మాణం మారుతుంది మరియు సులభంగా నమలవచ్చు కూడా. బాదంలను నీటిలో
నానబెట్టడం వలన నీటిని గ్రహించుకొని, మృదువుగా గట్టిదనం తగ్గి మరియు
సులభంగా జీర్ణం అవుతాయి.
నానబెట్టిన బాదంల వలన కలిగే ఇతర లాభాలు
బాదంలో
ఉండే మోనోసాకరైడ్ లు ఆకలిని నియంత్రించి, పొట్ట నిండినట్టుగా అనిపించేలా
చేస్తాయి. బరువు తగ్గాలి అనుకునే వారు వారితో నానబెట్టిన బాదంలను ఎల్లపుడు
ఉంచుకొని తినండి. అంతేకాకుండా, శరీరంలో ఉన్న చెడు కొవ్వు పదార్థాలను
తగ్గించి, మంచి కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గించటమే కాకుండా, గుండె
ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. నానబెట్టిన బాదంపప్పులలో ఉండే విటమిన్ 'E' లు
యాంటీ ఆక్సిడెంట్ లుగా పని చేసి, ఫ్రీ రాడికల్ ల వలన కలిగే ప్రమాదాల నుండి
మరియు ఇన్ఫ్లమేషన్ ల నుండి కూడా కాపాడతాయి.
No comments:
Post a Comment